రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్, పాలకవర్గ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటివని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు వంటి సేవలను పారదర్శకంగా అందించడంలో పీఏసీఎస్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. రైతులకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Agriculture
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ నిర్మించిన నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.పామాయిల్ ధర పెంపునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతుల ఆదాయం పెంచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడ అన్ని రకాల పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆయిల్ పామ్ మంచి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
మహిళా రైతులు వ్యవసాయ.. ఇతర అనుబంధ కార్యక్రమాలు అభివృద్ధి చేసుకొనుటకు అవసరమైన వ్యవసాయ ట్రాక్టర్, పనిముట్లప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సదరు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడం , వారిని ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా ప్రోత్సహించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే. మహిళా రైతులకు శ్రమను తగ్గించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పాదకతను సాధించేలా ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా, డైరీ, పౌల్ట్రీ వంటి అనుబంధ రంగాలలో కూడా మహిళలు రాణించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు యూరియా ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ విధానం ద్వారా పారదర్శకంగా యూరియా పంపిణీ జరుగుతోందన్నారు. ఏపీ ఐఎంఎస్ యాప్, ఓటీపీ ఆధారిత వ్యవస్థతో అక్రమాలకు తావులేకుండా రైతులకు ఎరువులు అందజేస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రభుత్వ యాప్ వినియోగంపై అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది. గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని, గత చైర్మన్ల ఆధీనంలో ఉన్న వసూళ్లతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల చోటుచేసుకున్నట్లు సమాచారం. సెక్రటరీకి ఉండాల్సిన అధికారాలను ఆమె స్వయంగా తీసుకుని, తనకు అనుకూల సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. అలాగే సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి జరగాలని నియమం ఉండగా, చైర్మన్ ప్రత్యేక నిర్ణయాల ద్వారా వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా వ్యవహరిస్తే రైతుల సంక్షేమం మైనది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చైర్మన్ సొంతగా తీసుకునే నిర్ణయాలు స్థానికంగా రాజకీయ చర్చలకు కారణమవుతోంది.
చైర్మన్ అలేఖ్య వ్యవహారంపై డైరెక్టర్లు మంత్రి కి ఫిర్యాదు చేసారని, వెంటనే ఆమెను పదవీ నుంచి తొలగించమని కోరారని సమాచారం. రైతుల సమస్యలు, ఎఫ్సిఐ గోదాముల వినియోగం, మార్కెట్ వసూళ్ల నిర్వహణ వంటి అంశాల్లో ఆమె నిర్ణయాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ సమస్య మరింత కఠినంగా మారింది. మార్కెట్ కమిటీలో అధికారాలను దుర్వినియోగం చేయడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్థానిక వ్యవస్థాపకులు, డైరెక్టర్లు భయపడుతున్నారని టాక్ నడుస్తుంది . అవసరమైన సంతకాలు చేయడంలోనూ , నిర్ణయాలు తీసుకోవడంలోనూ విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలేఖ్య తన విధులను సరియైన విధంగా నిర్వహించి, ప్రతి నిర్ణయాన్ని డైరెక్టర్లతో చర్చించి, రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు ఆసక్తిగా మారింది .
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్షించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిళ్లిందని అధికారులు వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా అధికారులు తేల్చారు. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశారు.
అలాగే, ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని సూచించారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, మరో 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఆరు జిల్లాల్లోని 16 మండలాలు, 89 గ్రామాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడిందని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పంటల వారీగా చూస్తే 630 హెక్టార్లలో మొక్కజొన్న, 384 హెక్టార్లలో వరి, మరో 200 హెక్టార్లలో మినుము వంటి పంటలు నీటి పాలయ్యాయని తెలిపారు. అటు అరటి, మామిడి వంటి ఉద్యాన పంటలకు కూడా భారీగా నష్టం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా, ప్రతి ఎకరా నష్టాన్ని ఖచ్చితంగా లెక్కించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. నందిపేట్ మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూసినా అందకపోవడంతో రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపించారు. వెంటనే యూరియా యాప్ను రద్దు చేసి, రైతులకు నేరుగా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు ఆర్బీఐ తీపి కబురు అందించింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా లేకుండా ఒక లక్షా 60వేల వరకూ రుణం తీసుకునే అవకాశం ఉండగా, దాన్ని 2 లక్షల వరకూ పెంచింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. పంట సాగుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితి పెంచుతూ వస్తోంది. నిబంధనల ప్రకారం .. సాధారణంగా భూ యజమాని నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. బ్యాంకులు ఎవరో కొందరికి డిపాజిట్లు ఉన్న రైతులకు మాత్రమే ఇలాంటి రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలను తీసుకొని అప్పులపాలవుతున్నారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకే ఆర్బీఐ ఈ సదుపాయం కల్పిస్తోంది. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నందున రైతులకు రుణ సదుపాయం మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల వల్ల చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఢిల్లీలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ చామల కిరణ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ లను వారి కార్యాలయాలలో కలిశారు. తెలంగాణలో రైతులు పత్తిపంటను ఎక్కువగా పండిస్తుంటారని, కానీ పత్తిని విక్రయించే సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పత్తి రైతుల సమస్యలను లేఖ ద్వారా తెలియజేశారు. ఈ సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తి, చర్చకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. అంతేగాక సమస్యలను పరిష్కరించి రైతులకు మేలు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రులను ఎంపీ చామల కోరారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి