సంగారెడ్డి జైలులో ఉంటున్న రైతు హీర్యానాయక్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. అదే సమయంలో రైతుకు బేడీలు వేసి తీసుకురావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బేడీలు వేసిన ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. హీర్యానాయక్ బేడీల ఘటనపై వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతు చేతులకు బేడీలు వచ్చాయని అన్నారు. జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని.. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు. హీర్యా నాయక్ను కూడా లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదు. బాలానగర్లోని ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్లు గుర్తించారు. ఉద్దేశ పూర్వకంగా చేశారా? లేక పొరపాటున చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 సురేష్ జైల్లో నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. హీర్యా నాయక్కు గుండెనొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పారు. అసలు సురేష్ ఫోన్లో మాట్లాడింది ఎవరితో అనే దానిపై ఆరా తీస్తున్నాం. ఈ కేసులో నిర్లక్ష్యం చేసిన అందరికీ కఠిన చర్యలు తప్పవు అని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
- ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్లో బలమైన ఆరంభం.ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 141308