ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam Case)లో కవిత బెయిల్ పిటిషన్(Kavita Bail Petition) పై విచారణను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)నేటికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖలైన బెయిల్ పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేడు తదుపరి విచారణ చేపట్టనున్నారు. కాగా, తన పిటిషన్లలో కవిత బెయిల్తో పాటు అరెస్టు, రిమాండ్ను ఆమె సవాల్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తదుపరి విచారణ జరగనుంది. కాగా, ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా ఉన్నాయని విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు. ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాది పలు కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని.. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంలో పెండింగులో ఉండడంతో విచారణ ముందుకు సాగడం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని తెలిపారు. అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని అందులో స్పష్టం చేశారని చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే 41 ఏ ప్రకారం సమన్లు జారీ చేశారని విక్రమ్ చౌదరి గుర్తు చేశారు. సీఆర్పీసీ 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చినవారు, ఆ తర్వాత 41 ఏ కు ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంలో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిందని తెలిపారు. అలాగే జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సీబీఐ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను న్యాయస్థానం అంగీకరించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం సీబీఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందన్నారు. రేపు మధ్యాహ్నం కౌంటర్ వాదనలు వినిపిస్తామని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది.
- పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు దహనం అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను కోల్కతా అలీపూర్లోని ప్రభుత్వ భవనంలో అధికారులు భద్రపరిచారు. ఈవీఎంల దహనంపై…
- మీనాక్షీ నటరాజన్కు సుప్రీంకోర్టు షాక్..సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీనాక్షి పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఆర్వో నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మీనాక్షి పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. మీనాక్షి…
- పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.రష్యాతో భారత్ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ను ప్రశ్నించే ఐరోపా దేశాలు, తమ విక్రయించిన ఆయుధాలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141555