బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అతడి బలబన్మరణానికి పరోక్షంగా కారణమైన భార్య నిఖితా సింఘానియా , అత్త నిషా, బావమరిది అనురాగ్ ను తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిఖితాను హర్యానా లోని గురుగ్రామ్ లో అదుపులోకి తీసుకోగా.. అత్త, బావమరిదిని ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో అరెస్ట్ చేసి ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లుగా పోలీసులు వెల్లడించారు.
కాగా, భార్య వేధింపుల కారణంగా అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు ముందు అతడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో , 24 పేజీల సూసైడ్ నోట్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే, అతుల్ రాసిన లేఖలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తున్నట్లుగా తెలిపాడు. తాను విడాకులు కోరగా.. తిరిగి తనపైనే అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించాడు. అదేవిధంగా ఆమెపై హత్యాయత్నం చేశానని, ఇష్టం లేకుండా సెక్స్ చేసేందుకు ప్రయత్నించానంటూ ఆరోపించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కోర్టులో నెలకు రూ.2 లక్షల చొప్పున భరణం ఇవ్వాలంటూ భార్య నిఖితా నోటీసులు పంపిందని అతుల్ కన్నీటిపర్యంతమై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు తాజాగా, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అతుల్ ఆత్మహత్యపై సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ‘X’ లో కూడా ‘మెన్ టూ’ఉద్యమం ట్రెండింగ్లో నిలిచింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్…
- సెమీకాన్ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో గురువారం ‘సెమీకాన్ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు…
- జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామన్నారు. అలాగే యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు…
- 96 ఏళ్ల తర్వాత జిల్లాలో రీ-సర్వే.96 సంవత్సరాల తర్వాత బౌండరీస్ చట్టం ప్రకారం జిల్లాలో రీ-సర్వే చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.…
- లండన్లో కన్నులపండువగా గంగా హారతి.బ్రిటన్ రాజధాని లండన్లో థేమ్స్ నది ఒడ్డున నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. చిన్మయ మిషన్ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా.. చిన్మయ్ మిషన్ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి