శ్రీచైతన్య కాలేజీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది. చైతన్య కాలేజీల్లో జరుగుతున్న స్టూడెంట్స్ ఆత్మహత్యలపై విద్యార్థిసంఘాల నాయకులు ఆందోళనలు జరుపుతున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. తాజాగా కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
నందికొట్కూరుకు చెందిన ప్రమీలరాణి కర్నూల్ లోని శ్రీ చైతన్య కాళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈరోజు ప్రమీలా రాణికి గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యం ఆసుపత్రిలో చేర్పించి… తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తమ కూతురికి తలపై ఎలా దెబ్బలు తగిలాయని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. యాజమాన్యం జవాబు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దెబ్బలు ఎలా తగిలాయో సీసీ ఫుటేజీ ఇవ్వాలని తండ్రి మద్దిలేటి డిమాండ్ చేశారు. అనుమానాస్పద రీతిలో దెబ్బలు తగలడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని..మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే.. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
- నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…
- పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి