Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Telangana అసెంబ్లీలో కేసీఆర్ పై భట్టి ఫైర్

అసెంబ్లీలో కేసీఆర్ పై భట్టి ఫైర్

by Rama
అసెంబ్లీలో కేసీఆర్ పై భట్టి ఫైర్

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులను దాచి.. తిరిగి తమపైనే నిందలేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులు, FRBM రుణ పరిమితిపై అసెంబ్లీలో మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్ ప్రభుత్వం మార్చేసిందని అన్నారు. చేసిన అప్పులు దాచడమే కాకుండా.. తిరిగి తమపైకి మాటల దాడికి పాల్పడుతున్నారని పైర్ అయ్యారు. చేసిందంతా చేసి తమపైనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని ధ్వజమెత్తారు. విపక్ష సభ్యులు సభకు, సభాపతికి కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఏసీ సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసిందని అన్నారు. గడిచిన పదేళ్లలో బీఏసీ సమావేశం ఎలా నిర్వహించారో మర్చిపోయారా అంటూ చురకలంటించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.