23
నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది . ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది . పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుండగులను గుర్తించడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు . ప్రజలు ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.





Total views : 90533