ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతి కోసం ఆలోచించి.. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దేశ చరిత్రలో ఆయన అమరజీవిగా ఖ్యాతి పొందారని, ఈ డిసెంబర్ 15 కు ప్రత్యేకత ఉందని, తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అలాగే ఈ రోజు ఉక్కుమనిషి సర్దార్ వల్ల బాబాయ్ పటేల్ వర్ధంతి అని.. దేశం మొత్తం ఏకం అవ్వడంలో ఆయన పాత్ర వర్ణించలేనిదని.. అందుకు ఆయన ఉక్కుమనిషి నిలిచాడని చెప్పుకొచ్చారు. అలాగే మద్రాస్ నుంచి తెలుగు రాష్ట్రంగా ఏపీ ఏర్పడటంలో పొట్టి శ్రీరాములు ఎంతో కృషి చేశారని, మద్రాసులో ఉన్నప్పుడు తెలుగు ప్రజల పరిస్థితి దుర్బలంగా ఉందని చెబుతూ.. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం తర్వాత తెలుగు భాష మాట్లాడే రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే ఏపీ ప్రజలు చాలా కీలక నగరాలను వదులుకున్నారని.. అభివృది చెయడం అక్కడి నుంచి విడిపోయి రావడం మనకు అలవాటు అయిపోయిందని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి