ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతి కోసం ఆలోచించి.. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దేశ చరిత్రలో ఆయన అమరజీవిగా ఖ్యాతి పొందారని, ఈ డిసెంబర్ 15 కు ప్రత్యేకత ఉందని, తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అలాగే ఈ రోజు ఉక్కుమనిషి సర్దార్ వల్ల బాబాయ్ పటేల్ వర్ధంతి అని.. దేశం మొత్తం ఏకం అవ్వడంలో ఆయన పాత్ర వర్ణించలేనిదని.. అందుకు ఆయన ఉక్కుమనిషి నిలిచాడని చెప్పుకొచ్చారు. అలాగే మద్రాస్ నుంచి తెలుగు రాష్ట్రంగా ఏపీ ఏర్పడటంలో పొట్టి శ్రీరాములు ఎంతో కృషి చేశారని, మద్రాసులో ఉన్నప్పుడు తెలుగు ప్రజల పరిస్థితి దుర్బలంగా ఉందని చెబుతూ.. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం తర్వాత తెలుగు భాష మాట్లాడే రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే ఏపీ ప్రజలు చాలా కీలక నగరాలను వదులుకున్నారని.. అభివృది చెయడం అక్కడి నుంచి విడిపోయి రావడం మనకు అలవాటు అయిపోయిందని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 38386