నీట్ పేపర్ లీక్పై హస్తినలో నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నీట్ పేపర్లీక్పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విద్యార్ధులకు న్యాయం చేయాలని పార్లమెంట్ నుంచి అధికార, విపక్షాలు నీట్ విద్యార్థులకు సందేశం ఇవ్వాలని రాహుల్ గాంధీ లోక్ సభలో డిమాండ్ చేశారు. ఇటు పార్లమెంట్ వెలుపల నీట్ పేపర్ లీక్పై విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించడానికి ముందే నీట్ పేపర్ లీక్పై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే లోక్ సభ స్పీకర్ మాత్రం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ తర్వాత నీట్ పేపర్ లీక్పై చర్చ జరుపుతామని చెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఇటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ నెలకొంది. సభ ప్రారంభం కాగానే నీట్పై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. రాజ్యసభలో పేపర్ లీక్ అంశాన్ని ఖర్గే లేవనెత్తారు. పేపర్ లీక్పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ఖర్గే డిమాండ్ చేశారు. చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకువచ్చారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 89904