దేశంలో ఇటీవల ప్రవేశ పెట్టిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్ల(Vande Bharat Railways)కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేయనుంది. నగరాల్లో ప్రజారవాణా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైళ్ల(Vande Metro Trains)ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ఏడాది జులై నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం.. అని అధికారి తెలిపారు. వేగంగా వెళ్లగలగడంతోపాటు వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఈ రైళ్లలో వినియోగించనుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్ లలో ఆగేందుకు వీలవుతుంది. ఈ ఏడాది వందేభారత్ మెట్రో రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వచ్చే రెండు నెలల తర్వాత ఈ రైళ్ల పరీక్షలు మొదలవుతాయి. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లలో లేని సదుపాయాలు వందే మెట్రోలలో ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అతిత్వరలో ప్రజలతో పంచుకుంటామని రైల్వే ఉన్నతాధికారి వివరించారు. అలాగే ఏ నగరంలో ముందుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. రైల్వే శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వందే మెట్రోలో బోగీల ఏర్పాటు ప్రత్యేకంగా ఉండనుంది. నాలుగేసి కోచ్ లను ఒక యూనిట్ గా పరిగణిస్తారు. కనీసం 12 కోచ్ లతో ఒక వందే మెట్రో ఉండనుంది. ఆయా రూట్లలో డిమాండ్ ను బట్టి కోచ్ ల సంఖ్యను 16కు పెంచుతారు.
- సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్…
- నేపాల్లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణనేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి కైలాస మానససరోవర్…
- అనకాపల్లి జిల్లాలో కీలక నిర్ణయం.పర్యావరణ పరిరక్షణ, చారిత్రక సంపద రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచధారల కొండల ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో తవ్వకాలు, క్వారీ పనులపై పూర్తి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.