తెలంగాణలో ఆగస్టు 15 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ.

Advertisements

<p>తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నూతన ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనుంది&period; మొత్తం 1&period;05 కోట్ల కొత్త రేషన్ కార్డులను దశలవారీగా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది&period; స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఎ&period; రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు&period; అదే రోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి రేషన్ కార్డుల పంపిణీ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు&period; అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.

సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…

బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.