చిత్తూరు జిల్లా కాణిపాకంలో విదేశీ భక్తుల సందడి

Advertisements

<p>చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం లో విదేశీ భక్తుల సందడి నెలకొంది&period; జర్మనీ&comma; రష్యా&comma; ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన సుమారు 170 మంది భక్తుల బృందం స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంది&period;జర్మనీ దేశానికి చెందిన శ్రీ పీఠ నిలయ భక్తి మార్గ్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీ పరమహంస విశ్వనాథ గురూజీ నేతృత్వంలో భక్తులు కాణిపాకం చేరుకున్నారు&period; ఆలయానికి విచ్చేసిన విదేశీ భక్తులకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు&period; అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు&period; ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు గారు&comma; ఈవో శ్రీ పెంచల్ కిషోర్ గారు భక్తులను ఆత్మీయంగా పలకరించారు&period; విదేశీ భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వైభవం&comma; నిర్వహణపై ప్రశంసలు వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సతీమణితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరు.

కుప్పంలో శ్రీ ప్రసన్న గంగమ్మ జాతర

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..