Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh దీపావళి ముసుగులో ప్రజల సొమ్ము స్వాహాకు..

దీపావళి ముసుగులో ప్రజల సొమ్ము స్వాహాకు..

by Rama
Diwali

ఏలూరు జిల్లా నూజివీడులో దీపావళి ముసుగులో ప్రజల సొమ్మును స్వాహా చేయడానికి కొందరు సిండికేట్ గా ఏర్పడి రంగం సిద్ధం చేసుకున్నారు. దీపావళి మందు బాణాసంచా అమ్మే షాపుల వేలంపాట నిర్వహించడం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు పట్టణంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో దీపావళి కి బాణాసంచా అమ్ముకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాణం లో చుట్టూ ప్రహరీ గోడ ఉండటం దగ్గర్లో పెట్రోల్ బంక్ జనావాసాలు ఉన్నాగాని ప్రభుత్వం ఇక్కడే దీపావళి టపాకాయల సామాను అమ్ముకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఇక్కడ షాప్ పెట్టుకునేందుకు ఈరోజు వేలంపాట నిర్వహించారు ఒక్కొక్క షాపు నుండి 10000 నుండి 35 వేల వరకు వేలంపాటలో షాపులు పెట్టుకునేందుకు షాప్ యజమానులు వేలంపాటలో దక్కించుకున్నారు. కొంతమంది సిండికేట్ అయి షాపు యజమానుల దగ్గర నుండి వేలంపాట నిర్వహించి మూడు నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేశారు. షాపుల నిర్వహణకు అధికారుల నుండి పర్మిషన్లు తెచ్చేందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణానికి అద్దెకు ఈ డబ్బును వినియోగించడం జరుగుతుందని సిండికేట్ మెంబర్లు తెలియజేస్తున్నారు. వేలంపాట నిర్వహణతో షాపులు దక్కించుకున్న యజమానులు ప్రజలు పై అధిక రేట్లు పెట్టి వసూలు చేసేందుకు రంగం సిద్ధం వాతావరణ మాలిపోలించక ప్రజలు ఎవరు కొనకపోతే ఎక్కువగా నష్టపోయేది షాపు యజమానులుగా మేమేంటో వారు ఇదిలా ఉండగా ఏదైనా ప్రమాదం తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. గతంలో ఇదే షాపులకు లాటరీ ద్వారా నిర్వహించగా నేడు కొంతమంది సిండికేట్ గా ఏర్పడి వాలంపాట ఏర్పాటు చేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో కాకుండా స్థానిక మార్కెట్ యార్డులో దీపావళి సామాన్విక్రయించే షాపులు ఏర్పాటు చేస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని ఎవరికి అద్దె చెల్లించాల్సిన అవసరం గానీ వేలంపాట నిర్వహించి డబ్బులు వసూలు చేసే అవసరంగానే ఉండదని తెలియజేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: