కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం కోడూరుపాడు లో బాణాసంచా పేలి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడిన వారిని విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా ఒక ఇంట్లో ఉల్లిపాయ బాంబులు అనుమతులు లేకుండా తయారుచేస్తున్న వైనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
crackers
దీపావళి నాడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే ఉల్లాసంగా… ఆనందంగా… ఆద్యాత్మిక వైభవంతో ఈ పండుగను జరుపుకొవచ్చు. దీపావళిరోజు కొత్తబట్టలతో.. పిండివంటలతో… స్నేహితులతో సంబరాలు జరుపుకొనే వారు తప్పక కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది.. మీ ఇంట్లోని వారు ఆందోళన పడకుండా వుంటారు. దీపావళి చిన్నారులకు అత్యంత ఇష్టమైన పండుగ… వారికి నచ్చిన పిండివంటలు బాణాసంచా ఈ పండుగ ప్రత్యేకం.. అందుకే బాణసంచా కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం. అలాగే చిన్నారులు, మహిళలు.. వృద్దాప్యంలో వున్నవారు మతాబులు.. చిచ్చుబుడ్లు.. కాకర పువ్వవత్తులు, అగ్గపెట్టేలు కాల్చేటపపుడు జాగ్రత్తలు అవసరం లక్ష్మీబాంబులు, ఔట్లు, సీమటపాకాయలు, రకరకాల బాణసంచా కాల్చేవారు యువకులు చాలా అప్రమత్తంగా వుండాలి. పేలని వాటికోసం మళ్లీ వెలిగించాలని ప్రయత్నించవద్దు. మీరు కాల్చే బాణసంచా మరీ విపరీతమైన శబ్దాలు చేస్తే మీ చుట్టుప్రక్కల చిన్నపిల్లలు జడుసుకోవచ్చు. అలాగే అనారోగ్యంతో ఇబ్బందిపడేవారు ఆశబ్దాలుకు భయపడటంచేత వారికి అసాధారణ వత్తిడి కలిగే పరిస్థితులు సంభవించవచ్చు. యువకులు రాకేట్లు, స్కైప్లయర్స్ , దీపావళి షట్స్ లాంటివి కాల్చేటప్పుడు ఎదురుగా వున్న ఇళ్లపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నిప్పు రవ్వలు ఒంటిపైన, దుస్తులపైన పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్ దుస్తులనే ధరించడం మంచిది
టపాసులు కాల్చేటప్పుడు మంటలు రేగితే అదుపు చేసేందుకు బకెట్లో నిండుగా నీళ్ళు పెట్టుకోండి ఒక వేళ మీ ఇంటి పక్కన ఉన్న ఏ గుడిసె పైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్ స ర్వీసెస్కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్ నెంబరు గుర్తుపెట్టుకోండి. పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది… బాంబులను ఎవరు కాల్చినా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. భూ చక్రాలను కాల్చే టప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో నేలపై పాకే పసికందులను కిదకు దించవద్దు. విడి బాంబులు లేదా సీరియల్గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది. వీటిని కాల్చేటప్పుడు వచ్చి పోయే వారిని గమనించండి. అత్యంత ముఖ్యంగా థౌజండ్ వాలా, 10 థౌజండ్ వాలా సీరీస్ను కాల్చేటప్పుడు జన సమర్థం లేకుండా చూసుకొని, పక్కవారికి చెప్పి కాల్చండి. అలాగే వీటిని రేకు డబ్బాల్లో కాల్చడం ద్వారా అత్యధిక శబ్ద కాలుష్యం వేలుబతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయవద్దు వాహనాలపై కవర్లు వేసి ఉంచండి. పండుగ సమయంలో మీ వాహనాలను వీలైనంత వరకూ ఇంటి లోపలే ఉంచేలా చర్యలు తీసుకోండి. పిల్లల చేతికి రాకెట్, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు. పెద్దలు మాత్రం వీటిని గుడిసెలకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాల్చడం మంచిది. అదే విధంగా వీటిని కొంచెం రాత్రి అయిన తరువాత, జన సమ్మర్ధం తగ్గాక కాల్చుకోవటం మేలు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మీ దీపావళి టపాసులను కాల్చడం పూర్తి చేసుకోండి.
గొప్పలు కోసం ఎక్కువగా టపాసులను కొనుక్కొని వాయుకాలుష్యానికి చేరువ కావద్దు. భారీ శబ్దాలను, విస్పోటనాలను కలిగించే టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్లపై ముద్రించి ఉండే సూచనలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా.. సరదాగా మీ బాణసంచా కాల్చండి. ఈ దీపావళిని సంబరాలతో జరుపుకోండి. రాత్రికి త్వరగా బాణసంచా కాల్చి కాళ్లు,చేతులు శుభ్రపర్చుకుని లక్ష్మీదేవిని పూజించండి హాయిగా విందు ఆరగించండి.. ఆరోగ్యంగా వుండండి.
ఏలూరు జిల్లా నూజివీడులో దీపావళి ముసుగులో ప్రజల సొమ్మును స్వాహా చేయడానికి కొందరు సిండికేట్ గా ఏర్పడి రంగం సిద్ధం చేసుకున్నారు. దీపావళి మందు బాణాసంచా అమ్మే షాపుల వేలంపాట నిర్వహించడం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు పట్టణంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో దీపావళి కి బాణాసంచా అమ్ముకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాణం లో చుట్టూ ప్రహరీ గోడ ఉండటం దగ్గర్లో పెట్రోల్ బంక్ జనావాసాలు ఉన్నాగాని ప్రభుత్వం ఇక్కడే దీపావళి టపాకాయల సామాను అమ్ముకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఇక్కడ షాప్ పెట్టుకునేందుకు ఈరోజు వేలంపాట నిర్వహించారు ఒక్కొక్క షాపు నుండి 10000 నుండి 35 వేల వరకు వేలంపాటలో షాపులు పెట్టుకునేందుకు షాప్ యజమానులు వేలంపాటలో దక్కించుకున్నారు. కొంతమంది సిండికేట్ అయి షాపు యజమానుల దగ్గర నుండి వేలంపాట నిర్వహించి మూడు నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేశారు. షాపుల నిర్వహణకు అధికారుల నుండి పర్మిషన్లు తెచ్చేందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణానికి అద్దెకు ఈ డబ్బును వినియోగించడం జరుగుతుందని సిండికేట్ మెంబర్లు తెలియజేస్తున్నారు. వేలంపాట నిర్వహణతో షాపులు దక్కించుకున్న యజమానులు ప్రజలు పై అధిక రేట్లు పెట్టి వసూలు చేసేందుకు రంగం సిద్ధం వాతావరణ మాలిపోలించక ప్రజలు ఎవరు కొనకపోతే ఎక్కువగా నష్టపోయేది షాపు యజమానులుగా మేమేంటో వారు ఇదిలా ఉండగా ఏదైనా ప్రమాదం తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. గతంలో ఇదే షాపులకు లాటరీ ద్వారా నిర్వహించగా నేడు కొంతమంది సిండికేట్ గా ఏర్పడి వాలంపాట ఏర్పాటు చేశారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో కాకుండా స్థానిక మార్కెట్ యార్డులో దీపావళి సామాన్విక్రయించే షాపులు ఏర్పాటు చేస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని ఎవరికి అద్దె చెల్లించాల్సిన అవసరం గానీ వేలంపాట నిర్వహించి డబ్బులు వసూలు చేసే అవసరంగానే ఉండదని తెలియజేస్తున్నారు.
రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల వ్యాపారస్తులు నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలని సత్యవేడు శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో టపాసుల విక్రయాలకు రెండు పర్మినెంట్ పర్మిషన్లు ఉన్నాయన్నారు. టెంపరరీ పర్మిషన్ కోసం పలువురు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. పోలీస్ రెవిన్యూ ఫైర్ శాఖల అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే టపాసుల విక్రయాలు నిర్వహించాలన్నారు. లైసెన్సులు మంజూరు కాకముందే టపాసులను నిల్వ ఉంచడం నేరమన్నారు. జన సమర్థ ప్రాంతాల్లో, ఇళ్లల్లో టపాసులను నిల్వ ఉంచుకోకూడదని స్పష్టం చేశారు. నేటి నుంచి టపాసు నిల్వలా కేంద్రాలపై తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జన సమర్థ ప్రాంతాల్లో ఎవరైనా టపాసు నిలువలను ఉంచినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టపాస్ విక్రయ కేంద్రాల వద్ద ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలను, అగ్ని నిరోధక సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Read Also..






Total views : 75477