విజయనగరం జిల్లా లక్కవరపుకోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలి 5 గురికి తీవ్ర గాయాలు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. వీరిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించారు. ఉదయం టీ పెట్టుకుందామని గ్యాస్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఘటన జరిగిందని సమాచారం. గాయాలు పడిన వారికి ప్రధమ చికిత్స చేసి విశాఖ కె.జి.హెచ్ కు తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన వారు గాయ పడిన వారి వివరాలు తామరాపల్లి వెంకటలక్ష్మి 50 సం,, ప్రాణవి 7 సం,, కెల్లా మోహన్ 10 సం,, కెల్లా లాష్య 8 సం,, కెల్లా శ్రావణి 30 సం,, సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి.. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఎల్.కోట గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరిగిన గ్యాస్ సిలిండర్ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోని గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి, వెంటనే బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు
గ్యాస్ సిలిండర్ పేలి 5 గురికి తీవ్ర గాయాలు..
356
previous post






Total views : 151621