Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home TelanganaWarangal కాళేశ్వరంలో భక్తుల సందడి

కాళేశ్వరంలో భక్తుల సందడి

by Rama
kaleswaram temple

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కార్తీకమాసం‌ సోమవారం కావడంతో భక్తుల‌ సందడి నెలకుంది. వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, సైకత లింగాలను ఏర్పాటు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద లక్ష ముగ్గు, లక్ష వత్తులు, దీపాలు వెలిగించి, దీప దానం, ప్రదక్షణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ ఇఓ మహేష్ ఏర్పాట్లు చేపట్టారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: