తెలంగాణలో రైతుభరోసాకు బ్రేక్ పడింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. మే9 లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఎన్నికల ప్రచారసభల్లో సిఎం ప్రస్తావించారని వచ్చిన ఫిర్యాదులతో ఈసీ ఈ ఆదేశాలు జారీచేసింది. రైతుభరోసా పధకం కింద ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ నెల 8లోపు ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే… రైతుభరోసాకు నిధులు విడుదల చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన చేయగానే ప్రభుత్వం నిధుల విడుదలకు చకచకా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.2వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రైతు భరోసా నిధులు ఆపేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- సీఎం రేవంత్రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్స్వామి.సీఎం రేవంత్రెడ్డిని MCHRD బోధి పెవిలియన్లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపైన ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు…
- తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది.…
- సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ బ్లాక్ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 194429