తెలంగాణలో రైతుభరోసాకు బ్రేక్ పడింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. మే9 లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఎన్నికల ప్రచారసభల్లో సిఎం ప్రస్తావించారని వచ్చిన ఫిర్యాదులతో ఈసీ ఈ ఆదేశాలు జారీచేసింది. రైతుభరోసా పధకం కింద ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ నెల 8లోపు ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే… రైతుభరోసాకు నిధులు విడుదల చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన చేయగానే ప్రభుత్వం నిధుల విడుదలకు చకచకా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.2వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రైతు భరోసా నిధులు ఆపేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.తెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నాచారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన బాలామృతం ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన…
- 105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగతనాల కేసుల్లో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మొత్తం 105 కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రయ్యను ఎనిమిది నెలలపాటు ప్రత్యేక నిఘా అనంతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 194194