గ్రీన్ ఫార్మింగ్ను ప్రోత్సహిస్తూ దానికి అనుబంధంగా వివిధ పరిశ్రమలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత సమన్వయంతో సుస్థిర అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధునిక కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుని అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు నుంచి పారిశ్రామిక రంగంలో సామర్థ్యాల విస్తరణ వరకు ప్రతి విభాగంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పారిశ్రామిక ప్రగతికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
గ్రీన్ ఫార్మింగ్కు ప్రభుత్వం ప్రోత్సాహం-మంత్రి శ్రీధర్ బాబు.
110
previous post




Total views : 202989