అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా రాజకీయ విమర్శలపై స్పందించిన మంత్రి నారాయణ… జగన్ చేస్తున్న “మావిగన్” రాజకీయ ఎత్తుగడలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. “మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోటకు తీసుకొస్తే, అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి తొలి దశ పనులు పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
118
previous post




Total views : 202967