Wednesday, July 8, 2026
News Navigation
Wednesday, July 8, 2026
News Navigation

Breaking

Wednesday, July 8, 2026
Home Latest News టూరిజంశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.

టూరిజంశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.

by CVR NEWS

తారామతి, బారామతిని టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. MCRHRDలో పర్యాటకశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు ఉన్నతాధికారులో సమీక్షలో పాల్గొన్నారు. దుర్గంచెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించాలన్నారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వికారాబాద్‌లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని… యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. క్యూర్ పరిధిలో ఉన్న అటవీశాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులు తీర్చి దిద్దాలని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలని… అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసుకొని పనులను ముమ్మరం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జీలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని… అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు. డిసెంబర్‌లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌పైన కసరత్తు ప్రారంభించాలని సూచించారు. సమ్మిట్ కోసం డిపార్ట్‌మెంట్‌ల మధ్య సమన్వయానికి కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038905
Total views : 192558

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: