Wednesday, July 8, 2026
News Navigation
Wednesday, July 8, 2026
News Navigation

Breaking

Wednesday, July 8, 2026
Home International కొనసాగుతున్న ప్రధాని మోదీ విదేశీ పర్యటన.

కొనసాగుతున్న ప్రధాని మోదీ విదేశీ పర్యటన.

by CVR NEWS
కొనసాగుతున్న ప్రధాని మోదీ విదేశీ పర్యటన

వివిధ రంగాల్లో ఇండోనేసియాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదపడనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.ఇరుదేశాల మధ్య బలమైన సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేసియా రాజధాని జకార్తాకు చేరుకున్న ప్రధాని మోదీకి..ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో, నలుగురు మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం జకార్తా గగనతలంలోకి ప్రవేశించగానే ఎఫ్‌-16 , సుఖోయ్‌-30 విమానాలు ఎస్కార్టుగా ఏకకాలంలో ప్రయాణించి వినూత్న రీతిలో స్వాగతించాయి. ఇదిలా ఉండగా.. తమ దేశానికి విచ్చేసిన ప్రధాని మోదీని ఇండోనేసియా ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ‘బింటాంగ్‌ ఆదిపూర్ణ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండోనేసియా’ పురస్కారంతో గౌరవించింది.. ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో.. ఈ మెడల్‌ను మోదీకి అందజేశారు
తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ .. ఇండోనేసియాలో దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం దిశగా పలు ఒప్పందాలు జరిగాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రబోవో..మోదీ పై ప్రశంసలు గుప్పించారు.రామాయణ కాలం నుంచి భారత్‌-ఇండోనేసియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. మొత్తంగా భవిష్యత్ లో ఇరుదేశాల బంధం మరింత బలోపేతం చేసే దిశగా ప్రబోవో..మోదీ చర్చలు సత్ఫలితాస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038906
Total views : 192559

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: