11
సంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగతనాల కేసుల్లో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మొత్తం 105 కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రయ్యను ఎనిమిది నెలలపాటు ప్రత్యేక నిఘా అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఇళ్లు ఖాళీగా ఉంచే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.





Total views : 192558