11
కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఎనిమిది ప్రత్యేక బృందాలతో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నారి తల్లి భవాని మీడియాతో మాట్లాడుతూ, కేసు దర్యాప్తుపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. చిన్నారి ఆచూకీపై ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.





Total views : 192558