ఉత్తరాఖండ్(Uttarakhand) లోని బద్రీనాథ్ ఆలయం(Badrinath Temple) తలుపులు తెరుచుకున్నాయి. శీతాకాలం మంచుతో ఈ ఆలయం కప్పబడి ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ లలో శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ ల తలుపులు అక్షయ తృతీయ రోజునే తెరుచుకున్నాయి. భద్రీనాథ్ ఆలయాన్ని పూలతో అలంకరించారు. హిందూవులు సందర్శించే తీర్ధయాత్రల్లో బద్రీనాథ్ యాత్ర ఒకటి. ఇది ప్రధానంగా విష్ణు భక్తులచే నిర్వహించబడుతుంది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో భద్రీనాథ్ ప్రముఖ పట్టణం.
సముద్రమట్టానికి మూడు వేల 133 మీటర్ల ఎత్తులో భద్రీనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ తీర్ధయాత్ర సాధారణంగా ఏప్రిల్ చివరలో లేదా మే నెల మొదటివారంలో ప్రారంభమవుతుంది. నవంబర్ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయ్యింది. రెండు రోజుల క్రితం శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ లు సందడిగా మారాయి. తొలిరోజు ఒక్క భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి రికార్డు స్తాయిలో కేదార్ నాథ్ ధామ్ ను సందర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీం ఫైర్వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని, సీఎం అంటే రాజు కాదని హితవు…
- కర్ణాటక సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలుకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఆఫర్ చేస్తోందని అన్నారు. ఆపరేషన్ లోటస్ ద్వారా మాత్రమే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.…
- మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి విగ్రహంమహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధించే ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కోరారు. శివాజీ పాదాలను వందసార్లు తాకేందుకు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.