చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ , మత్తు పదార్థాలు ప్రజలు ఎవ్వరూ వినియోగించరాదని జిల్లా కలెక్టర్ ద్యానచంద్ర హెచ్ఎం, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు.బుధవారం ఉదయం స్థానిక ప్రకాశం రోడ్డు నుండి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్ దుర్వినియోగం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణ కు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణ అరికట్టడం పై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ర్యాలీ ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలుఈ కార్యక్రమo ముఖ్య ఉద్దేశ్యం అనధికారిక డ్రగ్స్ , మత్తు పదార్థాల వినియోగం వల్ల ప్రజలకు ఏర్పడే దుష్ప్రభావాలపై మరియు వాటి అక్రమ రవాణా పై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. రోగాలకు వాడే మందులను వైద్యుల సూచనల మేరకు ఆరోగ్య రీత్యా వాడాలని వాటికి బానిసలుగా మారితే వాటివల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ బారిన పడి యువత వారి బంగారు జీవితాన్ని పాడు చేసుకోరాదని సూచించారు. స్కూల్స్ , కాలేజీలలో ఎవరైనా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉన్నట్లు తెలిస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాదక ద్రవ్యాల వాడకం నుండి వారిని బయటకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు , స్వచ్చంద సంస్థలు మరియు ఇతర సంఘాలు సమభాగంగా మత్తుకు బానిసలైన వారి కేసులు తమ ద్రుష్టికి వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వాటి వినియోగం నుండి బయటకు తీసుకుని రావడానికి కృషి చేయాలని అన్నారు. స్కూల్, కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి మత్తు నుంచి విముక్తి కలిగించుట కొరకు సందేహాలు, సూచనల కొరకు దగ్గరలోని రీహ్యాబిలిటేషన్ సెంటర్స్ ను సంప్రదిస్తే వీటిపై తగు సూచనలు, కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరమని శిక్షార్హులని అన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని,యువత మత్తుకు బానిస కాకుండా ముందుగానే అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.