Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ

పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ

by Rama
పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద ద‌ర్శ‌కుడు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ. గ‌త వారం రామ్ గోపాల్ వ‌ర్మపై ఐటీ చ‌ట్టం కింద కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసుపై నేడు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉండ‌గా.. తాను రాలేన‌ని పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తుంది. గ‌త వారం ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు మండ‌లం పోలీస్ స్టేష‌న్‌లో ఐటీ చ‌ట్టం కింద రామ్ గోపాల్ వర్మపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా స‌మ‌యంలో టీడీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌, నారా బ్రాహ్మాణిల‌ను కించ‌ప‌రిచేలా రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు గాను మ‌ద్దిపాడు టీడీపీ మండ‌ల ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి రామ‌లింగం ఈ కేసును పెట్టాడు. ఇక రామ‌లింగం ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు వ‌ర్మ‌పై కేసు న‌మోదు చేశారు. అయితే ఈ కేసుపై విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందిగా.. ఏపీ పోలీసులు వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ప్ర‌కారం మంగ‌ళ‌వారం వ‌ర్మ కోర్టుకు హాజ‌రుకావాల్సి ఉంది. అయితే అంత‌కంటే ముందే వ‌ర్మ ఏపీ హైకోర్ట్‌ను ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వ‌ర్మ‌ క్యాష్ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల పిటిషన్ కొట్టివేసింది. అలాగే అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.

ఇదిలావుంటే నేడు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచార‌ణకు హాజ‌రుకావాల్సి ఉంది వ‌ర్మ. అయితే, ఉదయం 10 గంట‌ల‌కు తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు మెసేజ్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు వాట్సాప్ లో ఆయన మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. త‌న‌పై న‌మోదైన కేసుకు సంబంధించి పోలీసుల‌కు స‌హక‌రిస్తాన‌ని చెప్పిన ఆర్జీవీ.. తన వ్యక్తిగత పనుల కోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరినట్లు తెలుస్తుంది. అనంత‌రం తాను త‌ప్పుకుండా విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
    ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
  • అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.
    అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
  • విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌
    క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్‌ విమానంలో ప్రయాణించిన సచిన్‌… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
  • ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.
    ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
  • దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.
    దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023178
Total views : 141307

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.