అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం

Advertisements

<p>ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది&period; అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు&period; అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; భువనేశ్వర్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న &&num;8216&semi;తులసి ట్రావెల్స్&&num;8217&semi;బస్సు&period;&period; రేగుపాలెం జంక్షన్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; మంటలు గమనించిన డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారంతా కిందకు దిగిపోయారు&period; దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది&period; మరోవైపు బస్సులో మంటలకు సంబంధించిన సమాచారమందుకున్న ఫైర్‌ సిబ్బంది&period;&period;వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు&period; ఐతే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగుండొచ్చని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.

సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…

బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.