కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.

Advertisements

<p>కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; కోజికోడ్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సు బిడాడి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది&period; వర్షంలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి రహదారిపై ఉన్న ఓవర్‌హెడ్‌ సైన్‌బోర్డు నిర్మాణాన్ని ఢీకొట్టిన అనంతరం బోల్తా పడింది&period; ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మిథిలేష్‌&comma; కండక్టర్ అరుణ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం&period; మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు&period; వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma; సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు&period; ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది&period; భారీ వర్షమే ప్రమాదానికి కారణమా&quest; అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.