నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గా వద్ద రెవెన్యూ-పోలీసుల వివాదం.

నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గా వద్ద రెవెన్యూ-పోలీసుల వివాదం

Advertisements

<p>నెల్లూరులోని బారాషాహిద్ దర్గా మొదటి గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; రెవెన్యూ సిబ్బంది&comma; పోలీసు అధికారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఆందోళనకు దారితీసింది&period; విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల పోలీసు అధికారులు&comma; ముఖ్యంగా సీఐ దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడారని నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఆరోపించారు&period;ఈ ఘటనకు నిరసనగా నెల్లూరు రూరల్ ఎమ్మార్వో కార్యాలయానికి చెందిన రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున దర్గా మొదటి గేటు వద్దకు చేరుకున్నారు&period; ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టడంతో పాటు బైఠాయించేందుకు ప్రయత్నించారు&period; దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period;పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఆర్డీవో అనూష&comma; ఏఎస్పీ దీక్ష సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపారు&period; వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.