కాకులు వాలని కోటప్ప కొండ ఎక్కడుందో తెలుసా.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Kotappa hill

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి&period; వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటి&period; శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం విశేషం&period; ఒక కొత్త ప్రదేశం గురించి తెలుకున్నప్పుడు&comma; అక్కడి విశేషాలను అందరి నోటా విన్నప్పుడు అక్కడికి ఒక్కసారైనా వెళ్లాలని అనిపించక మానదు&period; ఆ విన్న మాటలు అక్కడికి వెళ్లి చూశాక నిజమే అనిపిస్తే ఆ ఆశ్చర్యానికి అవధులు ఉండవు&period; మన చుట్టూ ఎన్నో వింతలు&comma; విశేషాలు ఉంటాయి&period; కానీ వాటిని గుర్తించడం&comma; వాటి గురించి తెలుసుకోవడంలోనే కొంత ఆలస్యం ఉంటుంది&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ అద్భుతమైన ప్రాంతం గురించి ఆలస్యం లేకుండా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం&period; కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు&period; కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు&period; అవును&excl; ఈ కొండపై కాకులు వాలవు&period; సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి&period; కానీ గుంటూరు జిల్లా నరసరావు పేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు&period; కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు&period; ఇప్పటి వరకూ ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు&period; అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి&quest; అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి&period;<br>కోటప్ప కొండ చరిత్ర&colon;<br>దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు&period; ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞాన బోధ చేయమని కోరుతాడు&period; అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్లి అక్కడ జ్ఞానం పొందుతాడు&period; ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలవబడుతుంది&period; కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి&period; ఈ మూడు శిఖరాలను బ్రహ్మ&comma; విష్ణు&comma; మహేశ్వరులుగా భావిస్తారు&period; అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా&comma; ఇక్కడ కొలువైన స్వామి వారిని త్రికుటాచలేశ్వరునిగా&comma; త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు&period; త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడు&period; ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరున్ని దర్శించి సేవిస్తాడు&period; ఆ తరువాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది&period; ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు&period; ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది&period; అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది&period; ఆమె రోజూ రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్ధనలు చేసేది&period; ఆమె భక్తిని పరీక్షించ దలచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు&period; ఆమె గర్భంతో ఉన్నా పరమేశ్వరున్ని కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావడం మానేది కాదు&period; ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకుని వస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది&period; ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది&period; తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు&period; అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కధనం&period; ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు&period; గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరున్ని ఓ కోరిక కోరుతుంది&period; తాను కొండ ఎక్కలేకపోతున్నాని&comma; నీవే కిందికి రావాలని కోరడంతో పరమ శివుడు సరే అంటాడు&period; కానీ నీవు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు&period; కొంత దూరం వెళ్లిన తరువాత భీకరమైన శబ్ధాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడే జంగందేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు&period; ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది&period; పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది&period; గొల్లభామ ఆలయం కొండ కింది భాగంలో చూడవచ్చు&period;<br>కోటప్ప కొండ విశేషాలు&colon;<br>మహాశివరాత్రి&comma; కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది&period; శివుడు దక్షిణామూర్తిగా&comma; బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు&period; కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు&period; పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే&period; ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు&period; గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి&period; అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్లి త్రికుటేశ్వరున్ని సేవించాలని అంటారు&period; ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా&comma; ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి&period;<br>ఎలా చేరుకోవాలి&colon;<br>కోటప్ప కొండ గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరంలో&comma; నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది&period; ఇక్కడికి కారు&comma; బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు&period; దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు గుంటూరు రైల్వే స్టేషన్ లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్ప కొండకు వెళ్లవచ్చు&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన&comma; ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటిగా నిలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.