Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News శ్రీధర్ నివాసంపై ఐటి దాడులు

శ్రీధర్ నివాసంపై ఐటి దాడులు

by Rama
vinjam Sridhar

ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.. అధికార పార్టీ నేతలే టార్గెట్ గా ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.. మిర్యాలగూడ బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు బినామీగా ఉన్న కాంట్రాక్టర్ వింజమూరి శ్రీధర్ ఇంటిపై తెల్లవారుజామునుండే ఐటీ దాడులు మొదలయ్యాయి. స్థానిక వైదేహి టౌన్షిప్ లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు.. దీంతోపాటు భాస్కర్ రావుకు సంబంధించిన రంగా రంజిత్ రంగా శ్రీధర్ బండారు కుశలయ్య నివాసాలలో కూడా ఐటి అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. సాగర్ నియోజకవర్గం లోని త్రిపురారం మండలం ముకుందాపురం సాల్వెంట్ ఆయిల్ మిల్లులో నిడమనూరు మండలం శాఖాపురం లో గల భాస్కర్ రావు నివాసంలో కూడా ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. 40 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

023147
Total views : 141205

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.