మరో నాలుగు నెలల్లో రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులోకి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి..పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.మరో నాలుగు నెలల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.అలాగే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీ గా ఉన్న సమయంలో రైల్వే గేటు వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని, రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మించి దాదాపుగా పదేళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబి పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని దసరా లోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం చేస్తే సహించేది లేదని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మెన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,రఘునాథ్ రెడ్డి, పల్లే రాజు, అబ్దుల్ అజీజ్, నాయకులు ఉన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.