సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో గత ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు క్వారీ లలోని పని స్థలాలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి. సింగరేణి వ్యాప్తంగా భారీ వర్షాలు భారీ యంత్రాలు సైతం మూలకు పడ్డాయి. ప్రాజెక్టులలో ఎక్కడికక్కడ బురద కావడంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులు సైతం ఖాళీగా ఉండే పరిస్థితి నెలకొంది. సింగరేణి వ్యాప్తంగా 23 భూగర్భ గనులు, 19 ఉపరితల గనులు ఉన్నాయి. అందులో భూగర్భ గనుల నుంచి 20శాతం, ఉపరితల గనుల నుంచి 80 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 1.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇటీవల వర్షాలతో ఉత్పత్తికి అంతరాయంతో పాటు వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్న బొగ్గు రవాణా కూడా స్తంభించిపోయింది. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో 1, 46, 595 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గితేనే తిరిగి యధావిధిగా ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి