రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తా బాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన పెంటం చందు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతారో ఏమో అని కరీంనగర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.కాగ గ్రామం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముస్తా బాద్ ఎస్.ఐ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.అదే సమయంలో అర్థ రాత్రి పూట ఇదే మండలం రామ లక్ష్మణ పల్లె తో పాటు మరో గ్రామానికి చెందిన అయిదు ట్రాక్టర్లు ఇసుక ను నింపుకొని ముస్తా బాద్ వెళ్ళే క్రమంలో అక్కడ పోలీస్ బందోబస్తు ఉన్న బ్లూ కోర్టు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ క్రమంలో అయిదు ఇసుక ట్రాక్టర్ లు బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ కు తారసపడగా ఇట్టి విషయం పికేటింగ్ లో అక్కడే ఉన్న ముస్తా బాద్ ఎస్.ఐ కి సమాచారం ఇవ్వగా ట్రాక్టర్ల వద్దకు వచ్చిన ఎస్. ఐ బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ ను రామ లక్ష్మణ పల్లె కు చెందిన ఓ ఇసుక ట్రాక్టర్ పై ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తీసుకు రావాలని చెప్పినట్లు సమాచారం.ఎస్ ఐ ఆదేశాల మేరకు సదరు కానిస్టేబుల్ ట్రాక్టర్ పై కుర్చోగా ట్రాక్టర్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ ను నామాపుర్ చెరువులో తోసి వేశాడు.దీంతో సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కాగ అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.