ఐజీఐ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె కలకలం.

Advertisements

<p>న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; విమానం ఎక్కేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి చేతి సంచిలో దాచి ఉంచిన పుర్రెను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు&period; ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌లో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వస్తువు బయటపడింది&period; దీనిపై ప్రశ్నించగా అది కోతి పుర్రె అని ప్రయాణికుడు వెల్లడించాడు&period; దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ అధికారులు పుర్రెను స్వాధీనం చేసుకున్నారు&period; వన్యప్రాణులతో సంబంధం ఉన్న వస్తువు కావడంతో తదుపరి దర్యాప్తు&comma; చట్టపరమైన చర్యల కోసం ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు&period; 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే అవకాశం ఉంది&period; ఈ ఘటన విమానాశ్రయ భద్రతలో సీఐఎస్ఎఫ్ అప్రమత్తతను మరోసారి స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్