లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్లోనే ఆ పార్టీ 26 సీట్లను దక్కించుకుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మూడవ దశలో అసోం- 4 సీట్లు, బీహార్-5, ఛత్తీస్గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ -10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2లలో పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం13 వందల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు.
- నీతి ఆయోగ్ సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలునీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని…
- ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందివిద్యాసంస్థలు ఈరోజు పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమీక్షించారు. ఈరోజు మధ్య మహారాష్ట్రలోని కొంకణ్లో అత్యంత భారీ…
- కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాడు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.