Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh తుఫాను వల్ల వరి పంటకు తీవ్ర నష్టం

తుఫాను వల్ల వరి పంటకు తీవ్ర నష్టం

by Satya
rice crop

వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో అకాల వర్షాల వల్ల రైతులు పండించిన పంటలు నేలకొరిగాయి. రైతులందరూ భయపడిపోతున్నారు. పూర్తిగా చేతికి అంది వచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే అల్లాడిపోతున్నారు. డెల్టా ప్రాంతం వేమూరు నియోజకవర్గంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్నారు. గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారం దాదాపుగా 94 వేల ఎకరాలు వరి పంట సాగు అవుతుంది. ఈరోజు వచ్చిన ఈ తుఫాను వల్ల తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వరి కోత అనేది మొత్తం మీద ఒక 20% జరిగింది. దాదాపుగా కోత కోయకుండా ఉన్న పొలాలన్నీ కూడా ఈ వర్షానికి కింద పడిపోతున్నాయి. ఈ విధంగా కింద పడిపోతే మొలకలు ఎత్తడం. రంగు మారడం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039668
Total views : 199103

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: