విచిత్ర దేవాలయాలు

Strange temples

Advertisements

&NewLine;<p>భారతదేశంలో నమ్మశక్యం కానీ వింతలు&comma; విశేషాలు ఎన్నో ఉన్నాయి&period; కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ భజిస్తారు&comma; కొన్ని చోట్ల దెయ్యాల్ని వదిలిస్తారు&comma; మరికొన్ని చోట్ల భక్తులు తలలు పగలకొట్టుకుని రక్తాన్ని చిందిస్తారు&period; ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు&period; 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు&comma; ఎన్నో ప్రత్యేకతలు&period; ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు మనం చూడవచ్చు&period; కానీ విచిత్రమైన&comma; అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం&period; ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి&period; అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం&period; అసలు ఈ అసాధారణ దేవాలయాల విశేషాలు ఏమిటి&quest; అవి ఎక్కడ ఉన్నాయి&quest; అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం&period;<br>1&period; మహేందిపుర్ బాలాజీ దేవాలయం&comma; రాజస్థాన్ &colon;<br>రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దెయ్యాల్ని&comma; ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తుంటారు&period; వీపరీతమైన చర్యల ద్వారా&comma; ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం&comma; పై కప్పు నుంచి వేలాడదీయడం&comma; గోడలకు తలను కొట్టడం&comma; గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్టశక్తుల నుంచి బాధితున్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు&period; భారతదేశంలో ఇప్పటికీ భూతవైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది&period; ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు&period; అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతారు&period; ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు&period;<br>2&period; కామఖ్య దేవి ఆలయం&comma; అస్సాం &colon;<br>అస్సాంలోని గువహతిలో ఉన్న నీలాచల్ కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయం ఉంది&period; భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి&period; ఈ ఆలయంలో విగ్రహం ఉండదు&period; మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలందుకుంటుంది&period; దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతుంటారు&period; ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత రుతుక్రమం జరుగుతుంది&period; అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి వేస్తారు&period; ఆలయం తెరిచే నాల్గవ రోజు వరకూ ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబచి మేళాను జరుపుతుంటారు&period; ఈ మూడు రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెబుతారు&period; ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తుంటారు&period;<br>3&period; దేవ్ జీ మహరాజ్ మందిర్&comma; మధ్య ప్రదేశ్ &colon;<br>ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను&comma; దుష్ట శక్తులను వదిలించుకోవడానికి మధ్య ప్రదేశ్ లోని దేవ్ జీ మహరాజ్ ఆలయానికి వస్తుంటారు&period; దుష్ట శక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడి సాధారణ పద్ధతి&period; వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురుతో కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు&period; దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ &&num;8216&semi;భూత్ మేళా&&num;8217&semi; లేదా &&num;8216&semi;దెయ్యాల ఉత్సవం&&num;8217&semi; నిర్వహిస్తుంటారు&period; భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది ఒకటి&period;<br>4&period; కాలభైరవనాథ్ దేవాలయం&comma; వారణాసి &colon;<br>పవిత్ర వారణాసి నగరంలో గల కాల భైరవ్ నాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు&period; అయితే ఇక్కడ నమ్మశక్యం కానీ నిజం ఏమిటంటే కాల భైరవ్ నాథ్ కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు&period; అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే&period; విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు&period; సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు&comma; స్వీట్స్ ను అమ్ముతుంటారు&period; కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం&period;<br>5&period; కొడంగల్లూర్ భగవతి ఆలయం&comma; కేరళ &colon;<br>కాళీ దేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళి దేవికి కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి ఏటా ఏడు రోజుల వింత భరణి పండుగ నిర్వహిస్తుంటారు&period; ఈ పండుగలో మహిళలు&comma; పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి&comma; కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు&period; రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు&period; అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు&period; ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదేపదే కొడతారు&period; పండుగ తరువాత 7 రోజులు ఆలయాన్ని మూసి వేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు&period;<br>6&period; స్తంభేశ్వర్ మహదేవ్&comma; గుజరాత్ &colon;<br>మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా&quest; గుజరాత్ లోని వడోదరకు దగ్గర్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం అటువంటిదే&period; ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు&period; భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి&period; రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది&period; ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది&period; ఆ సమయంలో భక్తులు వెళ్లి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు&period; మరలా కొన్ని గంటల తరువాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది&period; అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు&period;<br>7&period; బ్రహ్మ ఆలయం&comma; పుష్కర్&comma; రాజస్థాన్ &colon;<br>ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి&period; దీనిలో భాగంగా రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు&period; అయితే ఔరంగజేబు కంట పడినా కూడా నేటికీ చెక్కుచెదరక మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మ దేవుని ఆలయం ఒకటి&period; ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం ఇదే&period; హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం&period; పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి&period; ఇవి దాతలు&comma; భక్తుల పేర్లతో కనిపిస్తాయి&period;<br>8&period; దేవరగట్టు ఆలయం&comma; ఆంధ్రప్రదేశ్ &colon;<br>భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి&period; కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు&period; ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకూఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటారు&period; ఇక్కడి మాల మల్లేశ్వరుడు &lpar;శివుడు&rpar; చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు&period; దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి&comma; బాకులను వాడే వారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..