తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ థర్డ్ లిస్ట్ను కాసేపటి క్రితం ప్రకటించింది. మొత్తం 35 మంది అభ్యర్థులకు ఈ లిస్టులో చోటు దక్కింది. అయితే ఈ లిస్టులో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్ పేట సెగ్మెంట్లో కృష్ణా యాదవ్కు చోటు దక్కింది. ఇక బీజేపీ ముఖ్య నేతలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డా. లక్ష్మణ్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు థర్డ్ లిస్ట్ లో చోటు దక్కలేదు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు మూడో జాబితాలో చోటు దక్కలేదు. తొలి రెండు జాబితాల్లో 53 మంది, థర్డ్ లిస్ట్ లో 35 మంది కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్లయింది.
Tag:
కిషన్ రెడ్డి
తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ త్వరితగతిన పావులు కదుపుతూ.. రాజకీయ సమీకరణాలలో దూకుడు పెంచాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఓల్డ్సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు సైతం కట్టరన్నారు. ఓల్డ్సిటీలో ఎంఐఎం చేస్తున్నది తప్పు అని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని.. అటువంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం హేయనీయమన్నారు.



Total views : 76937