ఏలూరు జిల్లా(Eluru District) పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి జనసేన అభ్యర్థి(JanaSena Candidate) చిర్రి బాలరాజు(Chirri Balaraju) నామినేషన్(Nomination) వేసారు. ఈ కార్యక్రమంలో ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్(Putta Mahesh Yadav) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం నుండి భారీ ఎత్తున కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తూ.. బుట్టాయిగూడెం మండలం కోట రామ చంద్రపురం ఐటీడీఏకు చేరుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి, ఐటీడీఏ పీవో సూర్య తేజకి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం పుట్టా మహేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలని గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళతామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141335