రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి ఎన్నికల్లో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనుల్లో దిగామని, కలిసికట్టుగానే పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ప్రతినిధులతో కల్సి సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ ద్వారా ప్రభావితమైన డ్వాక్రా గ్రూపు మహిళలలో అత్యధిక శాతం ఎన్డీయే కూటమిని విశ్వసించి ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులను చూసే మీ అందరినీ ఒక పార్టీకి ఆపాదించారని ఆయన పేర్కొంటూ నిజానికి రాజమండ్రి డ్వాక్రా గ్రూపులు తెలుగుదేశానికి కంచుకోట అనే విషయం వేరే చెప్పనవసరం లేదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, ఇచ్చిన ప్రతిహమీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తామని ఆయన స్పష్టంచేశారు. ఆరోగ్యకర రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా అధ్వాన్నంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షణాల చేశామన్నారు. గత మూడు కౌన్సిల్స్ లో సభ్యులుగా ఉన్న మాజీ కార్పొరేటర్లకు ఎంతో అవగాహన ఉందని, వారంతా బాధ్యతగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాల్వ్ కూడా తిరగకపోతే కొత్త గా వేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఐదేళ్లుగా ఏమి జరిగిందో వెనక్కి తవ్వే ఆలోచన తమకు లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేస్తూ, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకున్నా సరే, జగన్మోహన్ రెడ్డి నిగౌరవించి లోపలకు పంపించామని గుర్తుచేసారు. ఇంతటి భారీ మెజార్టీలు ఇచ్చిన ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధివైపు దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఆలోచనతో ఉన్నామని ఆయన స్పష్టంచేసారు. వేఅయితే గతంలో జరిగిన తప్పులను మాత్రం తప్పులుగా చూపించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టంచేశారు. తెల్సి తెల్సి కూడా తప్పులు చేసినపుడు ఎన్డీయే కూటమి సూచన మేరకు చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గతంలో మాదిరిగా నలుపు దుస్తులు, నలుపు మాస్క్ లు పెట్టుకున్నా కార్యక్రమానికి రానివ్వని పరిస్థితులు ఉండబోవని, అలాగే పరదాలు కట్టుకుని తిరిగే విధానం చంద్రభాబు నాయుడికి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మీ దగ్గరమే వచ్చి మీ సమస్యలు వింటారని, మీతో మమేకమవుతారని అన్నారు. వేధింపులు ఉండవని, మినహాయింపులు ఉండవని అన్నారు. శుభపరిణామంగా మంచి రోజులు వస్తున్నాయని అందరూ కలసికట్టుగా పనిచేయడం ప్రారంభించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. హేవలాక్ బ్రిడ్జి గురించి, మల్టీపర్పస్ స్టేడియం మేచింగ్ గ్రాంట్ సంబంధించిన ఫైళ్లు పట్టుకుని ఎంపీ పురందేశ్వరి ఢల్లీి వెళ్లారని ఆయన అన్నారు. కాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చెం అందచేసి అభినందించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ఆర్పీలు, సీఓలు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ ఆర్థికంగా , విద్యాపరంగా, వృత్తి పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది. ఇది సహేతుకంగా…
- సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంస్థ ఒకప్పుడు దేశంలోనే ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. లక్ష…
- యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలోని నరసరావుపేట ప్రాంతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్,…
- సింగపూర్లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు..కొవిడ్-19 మళ్లీ సింగపూర్ను కలవరపెడుతోంది. ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ మధ్య 12 వేల 700 కొత్త కేసులు నమోదైనట్లు సింగపూర్ వైద్య వర్గాలు వెల్లడించాయి. గత వారంతో…
- ప్లాస్టిక్పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం..ప్లాస్టిక్పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం. నిజామాబాద్ జిల్లా పల్లెల్లో ఇప్పుడు ప్లాస్టిక్పై అసలైన యుద్ధం ప్రారంభమైంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు గ్రామాల్లో కనిపించకుండా చేయాలని గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 82540