రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి ఎన్నికల్లో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనుల్లో దిగామని, కలిసికట్టుగానే పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ప్రతినిధులతో కల్సి సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ ద్వారా ప్రభావితమైన డ్వాక్రా గ్రూపు మహిళలలో అత్యధిక శాతం ఎన్డీయే కూటమిని విశ్వసించి ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు. డ్వాక్రా గ్రూపులను చూసే మీ అందరినీ ఒక పార్టీకి ఆపాదించారని ఆయన పేర్కొంటూ నిజానికి రాజమండ్రి డ్వాక్రా గ్రూపులు తెలుగుదేశానికి కంచుకోట అనే విషయం వేరే చెప్పనవసరం లేదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, ఇచ్చిన ప్రతిహమీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తామని ఆయన స్పష్టంచేశారు. ఆరోగ్యకర రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా అధ్వాన్నంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షణాల చేశామన్నారు. గత మూడు కౌన్సిల్స్ లో సభ్యులుగా ఉన్న మాజీ కార్పొరేటర్లకు ఎంతో అవగాహన ఉందని, వారంతా బాధ్యతగా వ్యవహరించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.మహిళా సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాల్వ్ కూడా తిరగకపోతే కొత్త గా వేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఐదేళ్లుగా ఏమి జరిగిందో వెనక్కి తవ్వే ఆలోచన తమకు లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేస్తూ, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకున్నా సరే, జగన్మోహన్ రెడ్డి నిగౌరవించి లోపలకు పంపించామని గుర్తుచేసారు. ఇంతటి భారీ మెజార్టీలు ఇచ్చిన ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధివైపు దృష్టి పెట్టాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఆలోచనతో ఉన్నామని ఆయన స్పష్టంచేసారు. వేఅయితే గతంలో జరిగిన తప్పులను మాత్రం తప్పులుగా చూపించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టంచేశారు. తెల్సి తెల్సి కూడా తప్పులు చేసినపుడు ఎన్డీయే కూటమి సూచన మేరకు చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గతంలో మాదిరిగా నలుపు దుస్తులు, నలుపు మాస్క్ లు పెట్టుకున్నా కార్యక్రమానికి రానివ్వని పరిస్థితులు ఉండబోవని, అలాగే పరదాలు కట్టుకుని తిరిగే విధానం చంద్రభాబు నాయుడికి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. మీ దగ్గరమే వచ్చి మీ సమస్యలు వింటారని, మీతో మమేకమవుతారని అన్నారు. వేధింపులు ఉండవని, మినహాయింపులు ఉండవని అన్నారు. శుభపరిణామంగా మంచి రోజులు వస్తున్నాయని అందరూ కలసికట్టుగా పనిచేయడం ప్రారంభించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. హేవలాక్ బ్రిడ్జి గురించి, మల్టీపర్పస్ స్టేడియం మేచింగ్ గ్రాంట్ సంబంధించిన ఫైళ్లు పట్టుకుని ఎంపీ పురందేశ్వరి ఢల్లీి వెళ్లారని ఆయన అన్నారు. కాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చెం అందచేసి అభినందించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ఆర్పీలు, సీఓలు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్కు వస్తున్న జిన్పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్పింగ్తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.