రాజ్యాంగం అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్లో తొలిసారి ప్రసంగించారు. ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయం, భావప్రకటన, ఐకమత్యానికి రాజ్యాంగం సురక్షా కవచ్ లా పనిచేస్తోందన్నారు. అయితే గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పేవాళ్లు దాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ పేరును ప్రస్తావించకుండానే.. ఒక్కరికి ప్రయోజనం చేసేందుకు 142 కోట్ల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యాపారాలు, వనరులు, డబ్బులు కేవలం ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయన్నారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, మైన్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఒక్కరి చేతిలో పెట్టారని బీజేపీపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణ, రిజర్వేషన్ కోటాలను నిర్వీర్యం చేయడం ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయ సూత్రాలను బీజేపీ అణగదొక్కుతోందన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా వచ్చి ఉంటే ఇప్పటికే వారు రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను ప్రారంభించి ఉండేవారని ఆరోపించారు. గెలిచినా ఓడినంత పని కావడంతో రాజ్యాంగ మార్పు ఈ దేశంలో సాధ్యం కాదని బీజేపీకి అర్థమైందన్నారు. కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ అంటుంటే బీజేపీ మాత్రం తమ వైఖరిని దాటవేస్తోందన్నారు. కులగణన గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే వారు మాత్రం మంగళసూత్రాన్ని అపహరించుకుపోతారని అంటున్నారని ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సోలార్ డ్రైయర్తో విలువ ఆధారిత ఉత్పత్తులు.సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ… పండించిన పంటకు సరైన ధర రాక అప్పులపాలవుతున్న ఈ రోజుల్లో… మధ్యతరగతి రైతు తన వినూత్న ఆలోచనతో సరికొత్త విజయగాథను లిఖించారు. పంటను కేవలం పండించడమే కాదు… దానికి సాంకేతికతను జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారిస్తే…
- నీట్ రీ -ఎగ్జామ్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు,…
- ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…
- సింగపూర్లో CBN @ 361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ.ఏపీ సీఎం చంద్రబాబు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం…
- భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం.భారత ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. తాజాగా ఆయనకు స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్తో ప్రధాని మోదీని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 144588