ఆగస్టు 15 నాటికి ఎన్కూరు లింకు కెనాల్ ను పూర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం గోదావరి నీళ్లను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారి పల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను, . ఆ తర్వాత పంపు హౌజ్ -3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు.ఎదురవుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం రూ. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు పెంచి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా తాగునీరు ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమీక్షంచమన్నారు. ఎన్కూర్ లింకు కెనాల్ ను రాజీవ్ కెనాల్ గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు తొందరలోనే మొదలు పెడతామని వెల్లడించారు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబుతో పవన్ భేటీవిజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ప్రకటించిన కోటి రూపాయల తాలూకు చెక్కును ముఖ్యమంత్రికి…
- వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం..వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య…
- ముంపు కష్టాలు వీడేలా .. అభయమివ్వు గణేశావినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.…
- బుడమేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్విజయవాడ వదర బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామని అయన తెలిపారు. వరద నివారణకు ప్రధానంగా బుడమేరు గండ్లు పూడ్చాలి. గండ్లు పూడ్చడంలో ఆర్మీ సహకారం తీసుకున్నామని అయన అన్నారు.…
- కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనాలుగణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత గ్రాండ్గా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.