మెదక్ జిల్లా(Medak District)లో అకాల వర్షంతో రైతులు(Farmers) నష్టపోతున్నారు. మరో వైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట కళ్ళముందే వర్షార్పణం కావడంతో కన్నీరు, మున్నీరు అవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట నార్సింగి, నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇది చదవండి: గొలుసు దొంగ ను వెంటాడి పట్టుకున్న స్థానికులు
వర్షానికి ధాన్యం తడవకుండా ఉండడానికి అవసరమైన కవర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కేంద్రంలో రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. మరోవైపు కోతుల బెడద తీవ్రంగా ఉంది. ధాన్యం కుప్పలపై ఎగబడి కోతులు ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. ఓవైపు కోతులు, మరోవైపు అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- తెలంగాణకు కేంద్రం నుండి నిధులు కావాలితెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. యంగ్ ఇండియా పేరుతో రాష్ట్రంలో 100 ఇంటిగేట్రెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రాష్ట్రంలో ప్రారంభించబోతున్నామని దానికి 10వేల కోట్ల…
- రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి – గవర్నర్ జిష్ణు దేవ్ వర్మయువత వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు, రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి