కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ది రైతు పక్షపాత ప్రభుత్వం అనే విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో ఆమె స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు నిధులు ఆపేశామని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని ఒక్క కేసీఆర్ మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. 60 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ఆలోచించే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతుల కోసం రూ.25వేల కోట్లు వదులుకోవటానికి కేసీఆర్ సిద్ధపడ్డారని తెలిపారు. రిజర్వ్బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉందన్నారు. అలాంటిది ఓట్ల సమయంలో నిర్మలా సీతారామన్ వచ్చి తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు.
Warangal
నేడు వరంగల్ కు పవన్ కళ్యాణ్ రానున్నారు. హనుమకొండ బిజెపి అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బిజెపి అభ్యర్థి ప్రదీప్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేన అధినేత వరంగల్ హంటర్ రోడ్ లోని సిఎస్ఆర్ గార్డెన్ వద్ద బిజెపి శ్రేణులు భారీగా సభ ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పాల్గొననున్న బిజెపి, జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీ 111, జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పవన్ పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నేడు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభలలోనూ ఆయన పాల్గొననున్నారు.
మంగపేట మండలం కమలాపురం సినిమాలు రోడ్ లోని వేమా సాంబశివరావు ఇంటికి అర్ధ రాత్రి మంటలు చెలరేగడంతో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని, అర్ధ రాత్రి ఇంట్లో మంటలు రావడంతో ఎంచెయ్యాలొ తెలియలేదని, ఇంట్లో మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో ఎవరు లేక పోవడం, పెద్ద ప్రమాదం తప్పిందని సాంబశివారావు తెలియజేసాడు. స్థానిక యువకులు మంగపేట ఎస్సై రవికుమార్ కు సమాచారం ఇవ్వడంతో రవికుమార్ ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇచ్చారని వారు తెలిపారు. ఏటూరునాగారం నుండి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపు స్థానిక యువకులు చుట్టు పక్కల జనం మంటలు చెలరేగకుండా చుట్టుపక్కల ఇండ్లకు వ్యాపించకుండా కరెంటు మోటర్ల ద్వారా నీల్లు చల్లడంతో మంటలు అదుపు చేయ్యడం వలన పెద్ద ప్రమాదం తప్పింది.
ములుగు జిల్లా
ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది. కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు సమాచారం. రామప్ప గెస్ట్ హౌస్ లో వద్ద భారీగా చేరుకొన్న బిఆర్ఎస్ నాయకులు మీడియా ప్రతినిధులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు, పోలీసులు. గెస్ట్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల నుండి సోదాలు. ఎన్నికలకు సంబంధించిన డబ్బులు ఇతర వస్తువులు దొరకకపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ వెనకకు తిరిగిన అధికారులు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కార్తీకమాసం సోమవారం కావడంతో భక్తుల సందడి నెలకుంది. వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, సైకత లింగాలను ఏర్పాటు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద లక్ష ముగ్గు, లక్ష వత్తులు, దీపాలు వెలిగించి, దీప దానం, ప్రదక్షణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ ఇఓ మహేష్ ఏర్పాట్లు చేపట్టారు.
పరకాల పట్టణ శివారులో కాకతీయ థియేటర్ ఎదురుగ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు రానున్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 2లక్షల పై చిలుకు జనాలు రానున్నారని అంచనా వేస్తున్నారు. లలిత కన్వెన్షన్ హాల్ గ్రౌండ్ లో హెలిపాడ్ ల్యాండ్ అయిన తరువాత కాన్వాయ్ లో రోడ్ షో ద్వారా సభాస్థలికి చేరుకొనున్నారు.
జనగాం నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా కేంద్ర హోమ్ మంత్రి హమిత్ షా హాజరు అవుతున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణ ఏర్పాట్లను జనగామ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు, బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రాంతీయత్రుడే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతం వాడికి పట్టం కట్టాలని ప్రజల నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు. ఎన్నికల కమిషనర్ అక్టోబర్ 31కి చివరి తేదీ ప్రకటించిన తరువాత బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కాలేజీలో ఉన్న విద్యార్థులను మరియు స్టాప్ ను ఉపయోగించి 8620 ఓట్లను నమోదు చేయించుకుని అక్రమాగ్రంలో గెలవాలని చూస్తున్నారని చెప్పారు దీనిపైన ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తుమని చెప్పారు రేపు జరగబోయే సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
Read Also..
జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నేడు brs పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మున్సిపాలిటీ లోనీ పలు వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… జనగామ నియోజకవర్గ ప్రజలు 10 సం. రాల బీఆర్ఎస్ పరి పాలనలో సంతోషంగా ఉన్నారు అని అన్నారు. కెసిఆర్ చేపట్టిన పతకాలు అందరికీ అందుతున్నాయి అని అన్నారు. తిరిగి కెసిఆర్ గారిని ముఖ్యమంత్రి నీ చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్లకు జనగామ ప్రజలు సంతోషంగా ఉండటం వారికి ఇష్టం లేదు అందుకే ప్రచారం లో కూడా గూండాలను ఈసుకొని తిరుగుతున్నారు అని అన్నారు. అలాగే నిన్న జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలోని జన సమూహాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓటమి బాయం పట్టుకుంది అన్నారు. ఇకపోతే నేను లోకల్ కాదు అని ప్రచారం చేస్తున్నారు నాది ఎక్కడో కాదు తరిగొప్పుల పక్కనే మావురు అని అన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా వచ్చేది కెసీఆర్ ప్రభుత్వం మే తెలంగాణ ప్రజలు డిసైడ్ ఐ ఉన్నారు అని అన్నారు. జనగామ లో గెలిచేది మేమే జనగామకు కావలసిన పల్టెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ లు జనగామకి అవసరం ఉన్నవి అన్నీ కెసిఆర్ గారిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది అని అన్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో BRS ఎమ్యెల్యే అభ్యర్థులకు వ్యతిరేక పవనాలు తప్పడం లేదు. తాజాగా వర్ధన్నపేట ఎమ్యెల్యే అభ్యర్థి అరూరి రమేష్ పై నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల్ మండపల్లి గ్రామాన్ని గత తొమ్మిది సంవత్సరాల బట్టి దత్తత తీసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మడిపల్లి గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని 2018లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు మీద వందల ట్రిప్పుల ఇసుక ముఖ్య అనుచరుడు అమ్ముకున్నారు. ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని ఒక దళిత బంధు యూనిట్ కొత్త రేషన్ కార్డు ఏవి కూడా మడిపల్లి గ్రామ ప్రజలకు అందలేదని ఓటు అడిగే నైతిక హక్కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు లేదని మడిపల్లి గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..




Total views : 150068