Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home TelanganaKarimnagar కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం..

కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం..

by Rama
karimnagar TTD

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయనికి 10ఎకరాల స్థలం కేటాయించడం పై హర్షం వ్యక్తం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైసరి కమిటీ వైస్ ఛైర్మన్ మెట్టు రాఘవేంద్ర అభినందనీయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వాయిసరి కమీటీ వైస్ చైర్మన్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి లకు మెట్టు. రాఘవేంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హైద్రాబాద్ గోషామహల్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అందులో భాగంగా తెలంగాణ, కరీంనగర్ లో కేసీఆర్ ప్రకటించిన 10ఎకరాల భూమి లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి 20కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.అన్నివర్గాల మతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయం అని రాఘవేంద్రా పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023235
Total views : 141628

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.