Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో అభద్రతా భావం

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో అభద్రతా భావం

by Rama
sunil Dutt

సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో అభద్రతా భావం తొలగించడంతో పాటు వారికి బరోసా కల్పించడం కోసమే ఖవాత్ అని ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ తెలిపారు… ఈస్ట్ జోన్ పరిధిలోని చిలకల గూడ, వారాసి గూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కవాత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సునీల్ దత్ పాల్గొని వారితో కలసి కవాత్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సునీల్ దత్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా జరపడం కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సంఘ విద్రోహ శక్తులు పట్ల కటినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రౌడీ షీటర్లు అందరినీ బైండ్ ఓవర్ చేశామని ఓటర్లను భయపెట్టడం కానీ, బెదిరింపులకు పాల్పడడం కానీ చేస్తే నిసంకొచంగా దగ్గరలోని పోలీస్ స్టేషన్ పిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలంతా ఎన్నికలలో పాల్గొని తనయొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisements

You may also like

Our Visitor

023107
Total views : 140939

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.